సుబ్రహ్మణ్యుని సేవలో ప్రముఖులు
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిఘా సంస్థ మాజీ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షణ చేసిన వారు నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందజేశారు.


