‘పట్టా’భిషేకానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

‘పట్టా’భిషేకానికి వేళాయె

Jun 25 2025 7:14 AM | Updated on Jun 25 2025 7:14 AM

‘పట్ట

‘పట్టా’భిషేకానికి వేళాయె

ఏర్పాట్ల పరిశీలన..

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆర్‌. గంగాధరరావు, జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, వర్సిటీ వీసీ రాంజీలతో కలిసి కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. వంటశాల ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి వర్షం పడే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లను చేయాలన్నారు. విశ్వవిద్యాలయంలోని వంటశాలను ప్రారంభించిన అనంతరం బ్యాటరీ కారులో వైఎస్సార్‌ పరిపాలనా భవనానికి చేరుకుని అక్కడ పోలీస్‌ గౌరవవందనం స్వీకరించాక వైఎస్‌ చాన్స్‌లర్‌ చాంబర్‌లో కార్యనిర్వాహక మండలి సభ్యులతో సమావేశమవుతారన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియానికి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. ట్రైనీ కలెక్టర్‌ ఫర్హీన్‌ జాహిద్‌, ఏఎస్పీలు, ఆర్డీఓ పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవాలు బుధవారం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్‌ కూన రాంజీ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని మధ్యాహ్నం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సమావేశం జరుగుతుందన్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన వంటశాలను ప్రారంభిస్తారని తెలిపారు. గవర్నర్‌ నజీర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, కొల్లు రవీంద్ర హాజరవుతారన్నారు. 6వ స్నాతకోత్సవానికి సంబంధించి ఎన్‌ఎస్‌ఎల్‌ గ్రూప్‌ చైర్మన్‌ మండవ ప్రభాకరరావు, 7వ స్నాతకోత్సవానికి సంబంధించి అమెరికాలోని అలభామ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎంఎన్‌వీ రవికుమార్‌, 8వ స్నాతకోత్సవానికి సంబంధించి గ్రీన్‌ కో గ్రూపు సీఈవో చలమలశెట్టి అనిల్‌కుమార్‌కు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్నట్లు రాంజీ తెలిపారు.

పలువురికి గోల్డ్‌మెడల్స్‌, పట్టాలు..

ఈ స్నాతకోత్సవాలలో 17 మంది విద్యార్థులకు 21 గోల్డ్‌మెడల్స్‌, 63మందికి పీహెచ్‌డీ పట్టాలతో పాటు ఇరువురు ఎంఫిల్‌ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేస్తామని వీసీ తెలిపారు. వీరితో పాటు పోసు్ట్రగాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 300 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఉష, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ బ్రహ్మచారి పాల్గొన్నారు.

నేడు కృష్ణా యూనివర్సిటీ 6, 7, 8 స్నాతకోత్సవాలు

పాల్గొననున్న చాన్స్‌లర్‌, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

వివరాలు వెల్లడించిన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రాంజీ

‘పట్టా’భిషేకానికి వేళాయె 1
1/1

‘పట్టా’భిషేకానికి వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement