
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం కొనసాగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 155 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 142మంది, ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 196 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 493 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.
నేటి షెడ్యూల్ ఇలా..
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో బుధవారం నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నామని విజయసారథి చెప్పారు. బుధవారం
ఉదయం 9 గంటల నుంచి పాలిసెట్–2025 పరీక్షలో 1 నుంచి 40 వేల లోపు ర్యాంకు పొందిన ఎన్సీసీ అభ్యర్థులు, 1 నుంచి చివరి ర్యాంకు పొందిన విభిన్న ప్రతిభావంతుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు.
● మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 68,001 నుంచి 77 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 77,001 నుంచి 86 వేల లోపు ర్యాంకు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు.