
సారా తయారీ నిలిపివేయాలి
వేమిరెడ్డిపల్లి(విస్సన్నపేట): భావితరం భవిష్యత్తు కోసం నాటు సారా తయారీ, విక్రయం, రవాణా మానివేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండలంలోని వేమిరెడ్డిపల్లి తండాలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిలో భాగంగా శుక్రవారం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గతంలో సారా అమ్మేవారు, కాచే వారు తాము స్వచ్ఛందంగా మానేసినట్లు తన ముందు తెలపటంతో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. గ్రామంలో సారా కాయటం మానేసినవారు కొందరు కలెక్టర్తో మాట్లాడుతూ గతంలో తాము సారా కాచే వాళ్లమని, అది ఆపివేసి ఉపాధి హామీ పనులకు వెళుతున్నామని, తమకు గేదెలకు లోను, మేకల లోను, చిల్లరకొట్టు పెట్టుకునేందుకు లోను ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. చిన్నారులతో, వృద్ధులతో మాటాడారు. ప్రతి ఒక్కరూ మానసిక వత్తిడి తగ్గించుకోవటానికి, ఆరోగ్యం బాగుండటానికి ప్రతి రోజూ యోగా చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్డీఓ మాధురి, తహసీల్దార్ లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చినరాట్నాలు, గ్రామసర్పంచ్ విజయకుమారి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ