
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
సెలవుల్లో సరదాగా..
ప్రశాంతంగా పాలిసెట్
–8లోu
భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి యాగం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో ఆలయ అర్చకులు యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జన సంక్షేమార్థం, లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకులు యాగాన్ని జరిపించారు. అమ్మవారి మూలవిరాట్కు ఎర్ర కలువలతో విశేష అర్చన జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు జరిపించారు. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని తరించారు.
ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సత్కారం
విజయవాడస్పోర్ట్స్: సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కె.జి.వి.సరిత వీడ్కోలు పలికారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ పోలీసులు పి.వి.రమణ(సీపీవో), అబ్దుల్ కలామ్(ఎస్ఐ), కె.రామకృష్ణంరాజు(ఎస్ఐ), ఏ.శ్రీనివాసరావు(ఎస్ఐ), కె.సత్యనారాయణ(ఎస్ఐ), కె.వి.డి.మల్లేశ్వరి(ఎస్ఐ), ఏ.రామరావు(ఏఎస్ఐ), సి.హెచ్.కృష్ణారెడ్డి(ఏఎస్ఐ), ఎల్.విజయరాజు(హెడ్కానిస్టేబుల్), డి.శ్రీనివాసరావు(హోంగార్డు), ముల్లంగి సుబ్బులు(హోంగార్డు)లను ఆమె ఘనంగా సత్కరించారు. ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తినాయుడు, కార్యాలయ ఏవో సునీత తదితరులు పాల్గొన్నారు.
స్కేటింగ్ ఆసియా
చాంపియన్షిప్నకు జెస్సీరాజ్
విజయవాడస్పోర్ట్స్: ఆర్టిస్టిక్ స్కేటింగ్ అండర్–14 ఆసియా చాంపియన్షిప్నకు జెస్సీరాజ్ మాత్రపు అర్హత సాధించింది. జూలై 20 నుంచి 30వ తేదీ వరకు దక్షణకొరియాలో జరిగే ఈ చాంపియన్షిప్నకు జెస్సీ మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఇటీవల జరిగిన జాతీయ జట్టు ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి ఈ పోటీలకు ఎంపికై ంది. మే 15 నుంచి 30వ తేదీ వరకు, జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు మెహాలీలో రెండు విడతలుగా జరిగే భారత్ క్యాంప్నకు ఆమె హాజరుకానుంది. పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో జెస్సీ పదో తరగతి చదువుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి ఆమెను ప్రత్యేకంగా అభినందించి, సత్తా చాటాలని ఆకాంక్షించారు.
జి.కొండూరు: ‘వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకొక జీవికి ఆయువు మూడిందే’ అంటూ ఓ సినీ కవి రాసిన పాట అక్షరసత్యం. ప్రతి జీవి తన జీవన మనుగడ కోసం చేసే పోరాటంలో ఇది భాగం. కానీ అన్ని తెలిసీ.. అన్నీ అందుబాటులో ఉండీ, బతకడానికి ఎన్నో మార్గాలున్న మనిషి సైతం ప్రకృతి సమతుల్యతలో భాగమైన వన్య ప్రాణులను వేటాడుతూ, దానినే జీవనాధారంగా మార్చుకోవడం సహించలేని విషయం. వేటగాళ్ల ప్రభావంతో ఎంతో అరుదైన అటవీ జంతు సంపద కనుమరుగవుతోంది. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు వన్యప్రాణులను చిత్రాలలో చూపించడం తప్ప ప్రత్యక్ష ప్రదర్శన కష్ట తరంగా మారే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాహార్తి కోసం పొలాల వైపు..
ఎన్టీఆర్ జిల్లాలో 39వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వేసవి ఎండలు మండుతున్న క్రమంలో నీటి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే వన్య ప్రాణులు శివారు వ్యవసాయ భూముల, వాగులు, వంకల వైపు వస్తూ ఉంటాయి.
యథేచ్ఛగా వేట..
వేటగాళ్లు ఇదే అదునుగా భావించి వన్య ప్రాణుల పాద ముద్రల ఆధారంగా ఏ జంతువులు సంచరిస్తున్నాయో పసిగట్టి ఉచ్చులు పెడుతున్నారు. వ్యవసాయ భూములు వైపు వస్తున్నాయని పసిగడితే విద్యుత్ తీగల ఆధారంగా వన్య ప్రాణులకు షాకు తగిలేలా ఉచ్చులు పెట్టి జంతువులను పట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, జగ్గయ్యపేట, చందర్లపాడు, వీర్లపాడు, ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల పరిధిలోని అటవీ, కొండ ప్రాంతాలలో వేట ఎక్కువగా కొనసాగుతున్నట్లు సమాచారం.
వ్యాపారంగా మార్చుకొని..
అటవీ, కొండ ప్రాంతాలలో జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయించడం వేటగాళ్లు వ్యాపారంగా మార్చుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఎక్కువగా లభించే అడవి పంది, కణుజు, దుప్పి, కొండ గొర్రె, కుందేళ్లు, అరుదైన పక్షులను వేటాడి జంతువును బట్టి కేజీ మాంసం రూ.400 నుంచి 800వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేసవి కాలం మినహా మిగతా కాలాల్లో అడవి జంతువులు చిక్కని సమయాల్లో కొండముచ్చులను వేటాడి ఆ మాంసాన్నే దుప్పి మాంసంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. వేటగాళ్లు పగటి సమయంలో ప్రత్యేకమైన పద్ధతుల్లో ఉచ్చులను పెట్టి రాత్రి సమయాలలో వేట కుక్కలను వెంట తీసుకెళ్లి వేటను కొనసాగిస్తున్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే వేటగాళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు.
ఆటాడుకుందాం రండి..
విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో మే 1 తేదీ నుంచి 31వరకు వేసవి ఉచిత క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్స్, స్కేటింగ్ రింక్లలో శిక్షణ తరగతులు జరుగుతాయి.
● స్విమ్మింగ్.. గాంధీనగర్లోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర ఉన్న సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్, గురునానక్ నగర్లోని కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్, చిట్టినగర్లోని డాక్టర్ కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్స్లో శిక్షణ ఇస్తారు.
● బ్యాడ్మింటన్.. బందరురోడ్డులోని దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియంలో, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శిక్షణ తరగతులు జరుగుతాయి.
● స్కేటింగ్.. సత్యనారాయణపురంలోని జీవీఎస్ శాస్త్రి పార్కులో, భవానీపురంలోని రోజ్ గార్డెన్ పార్కులో, దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్లో శిక్షణ ఇస్తారు.
● యోగ.. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగాలో ఉచిత శిక్షణ తరగతులు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 88.27 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 7,661 మంది విద్యార్థులను కేటాయించగా వారిలో 6,762 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగింది. విద్యార్థులు గంట ముందుగా పది గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. విజయసారథి పరీక్షను పర్యవేక్షించారు.
ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ..
నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని నలంద విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి నున్నకు చెందిన విద్యార్థి సందీప్, కండ్రిక నుంచి వచ్చిన వర్షిత్కుమార్ వారి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో చేరుకున్నారు. అయితే అప్పటికే 11 గంటలు దాటడంతో అధికారులు వారిని అనుమతించలేదు. వారితో పాటుగా మరో ఇద్దరు విద్యార్థులు సైతం ఆలస్యంగా రావడంతో వారూ వెనుదిరిగి వెళ్లిపోయారు.
కృష్ణాలో 4,083 మంది హాజరు..
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని మొత్తం 10 కేంద్రాల్లో 4,562 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,083 మంది హాజరయ్యారని జిల్లా పరిశీలకుడు ఎ.శివప్రసాద్ తెలిపారు. వీరిలో 2,689 మంది బాలురకు గాను 2,424 మంది, 1,873 బాలికలకు గాను 1,659 మంది హాజరయ్యారని చెప్పారు.
7
న్యూస్రీల్
రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న వేట జంతు మాంసం విక్రయాలను వ్యాపారంగా మార్చుకున్న వేటగాళ్లు కనుమరుగవుతున్న అరుదైన అటవీ జంతు సంపద వేసవి తాపంతో నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న వన్య ప్రాణులు ఎన్టీఆర్ జిల్లాలో 39 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం
ఇటీవల కొన్ని ఘటనలు..
గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లా పరిధి ముసునూరు మండలంలోని వేలుపుచర్ల శివారు అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 12వ తేదీన వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు అడవి పందులను అటవీశాఖ అధికారులు ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి మునగపాడు గ్రామ శివారులోని గ్రంథివాని చెరువు వద్ద అడవిలో వదిలేశారు.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి గంగినేనిశివారులోని కొండ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం పెట్టిన ఉచ్చు తగిలి ఇదే గ్రామానికి చెందిన మేకల కాపరి కాలికి తీవ్ర గాయమైన ఘటన ఇటీవల జరిగింది. ఉచ్చు పెట్టిన వేటగాడు ఎవరో తెలియకపోవడంతో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వైద్యం చేయించుకొని వదిలేశారు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..
కొండపల్లి ఫారెస్ట్ సెక్షన్లో వేట జరగకుండా సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులను ఇప్పటి వరకు ముప్పై వరకు తొలగించి నిర్యీర్యం చేశాం. ఈ ఉచ్చులన్నీ ఎక్కువగా మొక్కజొన్న చేలు, జంతువులు నీటి కోసం వచ్చే ప్రదేశాలలో పెడుతున్నారు. వేటాడుతూ ఎవరైనా చిక్కితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎం.రామిరెడ్డి, కొండపల్లి ఫారెస్ట్ సెక్షన్ డీఆర్ఓ

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా