చెదరని నెత్తుటి జ్ఞాపకాలు | - | Sakshi
Sakshi News home page

చెదరని నెత్తుటి జ్ఞాపకాలు

Oct 20 2025 9:12 AM | Updated on Oct 20 2025 9:12 AM

చెదరని నెత్తుటి జ్ఞాపకాలు

చెదరని నెత్తుటి జ్ఞాపకాలు

● 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడిచివెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్‌ వద్ద 30 మంది నక్సలైట్లు పకడ్బందీ పథకం ప్రకారం మాటువేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. గంధం రామస్వామి ఉరఫ్‌ సాగర్‌ అనే దళ కమాండర్‌ నేతృత్వంలో ఈ దాడి జరిగింది. ఘటన స్థలాన్ని అప్పటి సీఎం ఎన్టీఆర్‌ పరిశీలించారు. జిల్లాను ఆదర్శ జిల్లాగా ప్రకటించి గిరిజనులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ● 1989 ఫిబ్రవరి 1న జరిగిన సంఘటనకు ఒకరోజు ముందు ఖానాపూర్‌ మండలం రాజూరా గ్రామంలో నక్సలైట్లు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు ఆ గ్రామానికి వెళ్తుండగా కడెం మండలం సింగాపూర్‌ సమీపంలో పకడ్బందీ వ్యూహంతో నక్సలైట్లు పోలీసుల జీపును పేల్చివేశారు. ఎస్సై ఖాదర్‌ఉల్‌హక్‌, ఆరుగురు కానిస్టేబుళ్లు జి.బాపురావు, ఎండీ జలీల్‌, శేక్‌ హైదర్‌, వేణుగోపాల్‌, భోజారావు, ఎస్‌.మోహన్‌దాస్‌ ప్రాణాలు కోల్పోయారు. ఒకే కానిస్టేబుల్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ● 1999 డిసెంబర్‌ 5న కడెం మండలంలో బందోబస్తుకు వెళ్లి పోలీసులు వస్తుండగా ఖానాపూర్‌ మండలం తర్లపాడ్‌ గ్రామసమీపంలో నక్సలైట్లు రిమోంట్‌కంట్రోలర్‌ సాయంతో పోలీసులు వెలుతున్న ప్రై వేటు జీపును పేల్చివేశారు. అందులో ప్రయాణిస్తున్న ఎసై ్స మల్లేశ్‌తో పాటు కానిస్టేబుల్‌, ప్రై జీపు డ్రై వర్‌ దుర్మరణం చెందారు.

నాటి నక్సలైట్ల దాడుల్లో 19 మంది పోలీసుల దుర్మరణం అమరుల కుటుంబాల్లో తీరని శోకం రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

ఖానాపూర్‌: ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్‌ జిల్లా పరిధిలో నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్‌ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఖానాపూర్‌ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈనెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సాక్షి కథనం.

ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్‌ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్‌ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలయ్యారు. ఖానాపూర్‌ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే నక్సలైట్లు విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు.

ఖానాపూర్‌లో అమరుల స్తూపం

ఖానాపూర్‌ పోలీస్‌ష్టేషన్‌లో పోలీసు అమవీరుల స్మారకార్థం స్తూపం లేదు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో వేపచెట్టు కింద కొన్నేళ్లుగా శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచారు. 2008లో అప్పటి సీఐ, ఎస్సైలు స్మారక స్తూప నిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుత సీఐ అజయ్‌తోపాటు ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.

సంఘటనల వివరాలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement