
రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదాం
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సింగరేణిలో పనిచేసే ప్రతిఒక్కరూ పునరంకితమవ్వాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా జీఎం కార్యాలయంలో తెలంగాణ తల్లి, అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గోలేటిలోని ప్రధాన రహదారితోపాటు కార్మిక కాలనీల్లో తెలంగాణ రన్ నిర్వహించారు. బెలూన్లు పైకి ఎగురవేశారు. జీఎం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ పాత్ర ఎంతో కీలకంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, కై రిగూడ పీవో నరేందర్, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి గోలేటి టౌన్షిప్లోని భీమన్న స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలతో సేవా సమితి సభ్యులు, అధికారులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం కేక్కట్ చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ఉద్యోగులను శాలువాలతో సన్మానించారు. సేవా సమితి ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్న సభ్యులు, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు జీఎం బహుమతులు అందించారు.
ఉత్తమ ఉద్యోగిని సన్మానిస్తున్న జీఎం, తదితరులు

రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదాం