
పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలి
కౌటాల: వరి ధాన్యాన్ని పకడ్బందీగా కొనుగోలు చే యాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా సూచించారు. మండలంలోని సాండ్గాం గ్రామంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చే సిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ ప్రమోద్, నిర్వాహకులున్నారు.
యోగా శిక్షణ కేంద్రం ప్రారంభం
కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జన భవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత యోగా, ధ్యాన శిక్షణ కేంద్రాన్ని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా ప్రారంభించారు. కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఐ రమేశ్, ఎంపీడీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు సురేశ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండలాధ్యక్షుడు కుంచాల విజయ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దుర్గం మోతీరాం, పతంజలి జిల్లా అధ్యక్షుడు రవీందర్గౌడ్, యోగా శిక్షకుడు వినోద్గౌడ్, నాయకులు నాందేవ్, భూమయ్య, అశోక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.