
సీఎం సహాయ నిధి పేదలకు వరం
బెజ్జూర్: సీఎం సహాయ నిధి పేదలకు వరంలాంటిదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బెజ్జూర్ మండలానికి చెందిన కమెరా నిమ్మబాయి, అంకుబాయి, కొరేత శ్రీశైలంకు మంజూరైన సుమారు రూ.60వేల చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆస్పత్రుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్థన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విశ్వేశ్వర్రావు, మాజీ సర్పంచ్ కొండ్ర జగ్గాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.