
‘ఉపాధి’ పనులు పారదర్శకంగా చేపట్టాలి
కౌటాల: ఉపాధి హామి పనులు పారదర్శకంగా చేపట్టాలని డీఆర్డీవో బి.దత్తారావు అన్నారు. బుధవారం కౌటాల రైతు వేదికలో 14వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు కౌటాల మండలంలో ఉపాధి హామి పథకంలో 2024–25లో చేపట్టిన పనుల వివరాలు చదివి వినిపించారు. కౌటాల మండల వ్యాప్తంగా రూ. 7,50,12,778 నిధులతో ఉపాధి హామి పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో అధికారులు రూ.1.50 లక్షల నిధుల రికవరీ చేయగా సిబ్బందికి రూ.30 వేల పెనాల్టీ వేశారు. ఉపాధి హామి సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, ఎంపీడీవో బి.రమేశ్, ఎంపీవో మహేందర్రెడ్డి, ఏపీఎం ముక్తేశ్వర్, ఏపీవో పూర్ణిమ, ఈసీ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.