‘ఉపాధి’ పనులు పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పనులు పారదర్శకంగా చేపట్టాలి

Jun 5 2025 7:32 AM | Updated on Jun 5 2025 7:32 AM

‘ఉపాధి’ పనులు పారదర్శకంగా చేపట్టాలి

‘ఉపాధి’ పనులు పారదర్శకంగా చేపట్టాలి

కౌటాల: ఉపాధి హామి పనులు పారదర్శకంగా చేపట్టాలని డీఆర్‌డీవో బి.దత్తారావు అన్నారు. బుధవారం కౌటాల రైతు వేదికలో 14వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు కౌటాల మండలంలో ఉపాధి హామి పథకంలో 2024–25లో చేపట్టిన పనుల వివరాలు చదివి వినిపించారు. కౌటాల మండల వ్యాప్తంగా రూ. 7,50,12,778 నిధులతో ఉపాధి హామి పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో అధికారులు రూ.1.50 లక్షల నిధుల రికవరీ చేయగా సిబ్బందికి రూ.30 వేల పెనాల్టీ వేశారు. ఉపాధి హామి సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సిద్దల దేవయ్య, ఎంపీడీవో బి.రమేశ్‌, ఎంపీవో మహేందర్‌రెడ్డి, ఏపీఎం ముక్తేశ్వర్‌, ఏపీవో పూర్ణిమ, ఈసీ సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement