
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి
పెంచికల్పేట్: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి సూచించారు. మంగళవారం పెంచికల్పేట్ జెడ్పీఎస్ఎస్ ఆవరణలో ఎంపీడీవో అధ్యక్షతన సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీ టి సరఫరా, పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై చర్చించారు. ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత, బ్లీచింగ్ పౌడ ర్ వాడకం, నీటి లీకేజీల నివారణకు మార్గదర్శకాలు జారీ చేశారు. డ్రెయినేజీల్లో పూడికతీత, దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ‘డ్రై డే’ పాటించాలని, బడిబాటను విజయవంతం చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్, తహసీల్దార్ పుష్పలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ హసీనా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్షీన్ పాల్గొన్నారు.