ముంపు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి | - | Sakshi
Sakshi News home page

ముంపు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి

Jun 4 2025 12:17 AM | Updated on Jun 4 2025 12:17 AM

ముంపు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి

ముంపు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా చే పట్టనున్న గోలేటి ఓసీపీలో ముంపునకు గుర య్యే భూముల రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సోనాపూర్‌ గ్రామస్తులు బుధవా రం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాంకు వినతిపత్రాలు ఇ చ్చారు. ఎకరాకు రూ.60లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీ సుకోవాలని కోరారు. సింగరేణి యాజమాన్యం పరిహారం చెల్లింపుల విషయంలో అ న్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించా రు. ముంపునకు గురయ్యే భూముల మార్కె ట్‌ విలువ రూ.60లక్షలు ఉండగా, రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2.25లక్షలుగా చూపిస్తూ రూ.7.5 లక్షలు చెల్లించి లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. తమ డిమాండ్లను అంగీకరించకుంటే సింగరేణికి భూములు ఇవ్వమని చెప్పారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేస రి ఆంజనేయులుగౌడ్‌, గ్రామపటేల్‌ దొందేరావు, సిడాం తిరుపతి, మధూకర్‌గౌడ్‌, రైతులు భగవంత్‌రావు, సదయ్య, అనంతరావు, నవీన్‌, లక్ష్మణ్‌, భుజంగరావు, తిరుపతి, సాగర్‌, శంకర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement