
పేదోళ్లకు ‘బెస్ట్’ స్కూళ్లు
● జిల్లాలో రెండు పాఠశాలల ఎంపిక ● నిరుపేద ఎస్సీ విద్యార్థులకు వరం ● ఈ నెల 16వరకు దరఖాస్తు గడువు ● లక్కీ డ్రా పద్ధతిలో సీట్ల కేటాయింపు
కౌటాల: నిరుపేద ఎస్సీ విద్యార్థులకు జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో రెసిడెన్షియల్, నాన్రెసిడెన్షియల్ సౌకర్యాలతో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచిత విద్యతోపాటు వసతులు కల్పిస్తోంది. జిల్లాకు రెండు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఇవ్వడంతో ఇవి జిల్లాలోని నిరుపేద ఎస్సీ విద్యార్థులకు వరంగా మారుతున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశాల కోసం అధికారులు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా..
జిల్లా కేంద్రంలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకోవాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఈ నెల 16లోపు జిల్లా ఎస్సీ కార్యాలయంలో అందజేయా లి. ప్రవేశాల కోసం ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్ కార్యాలయంలో లక్కీ డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా ఎస్సీ కార్యాలయం లేదా బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎన్నికైన ఆయా పాఠశాలలను సంప్రదించాలని సూచించారు.
ప్రవేశాల కోసం అర్హతలివే..
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉంటుంది. జిల్లాకు చెందిన వి ద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటో తరగతిలో ప్రవేశం పొందేవారు 01.06.2019 నుంచి 31.05. 2020 మధ్య జన్మించి ఉండాలి. 01.06.2025 నాటికి 5–6 ఏళ్లలోపు ఉండాలి. 2024–25 విద్యాసంవత్సరంలో నాలుగోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హులు. ఆదాయ ధ్రువీకరణ పత్రం (గ్రామీణ ప్రాంతాలవారికి వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలవారికి రూ.2లక్షల వరకు) మీ సేవ ద్వారా 01.04.2025 తర్వాత పొంది ఉండాలి.
జత చేయాల్సిన పత్రాలివే..
విద్యార్థులు దరఖాస్తు ఫారానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. జనన ధ్రువీకరణ పత్రం (మీ సేవా ద్వారా పొందింది), ఆధార్కార్డు, మూడు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు, కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు (మీ సేవ ద్వారా పొందినవి), తెల్ల రేషన్కార్డు, నాలుగో తరగతి మార్కుల జాబితా, బోనఫైడ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేయాలి.
స్వదినియోగం చేసుకోవాలి
జిల్లాలోని నిరుపేద ఎస్సీ వి ద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప థకం కింద ఎంపికై నవారికి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తాం. అర్హులు ఈ పథకాన్ని స్వదినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్యాలయం లేదా బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను సంప్రదించాలి. – యాదగిరి,
మయూరి విద్యాలయ కరస్పాండెంట్, కౌటాల
లక్కీ డ్రా ద్వారా ఎంపిక
జిల్లాలోని ఎస్సీ సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 16లోపు దరఖాస్తులు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కార్యాలయంలో ఇ వ్వాలి. 20న కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తాం. వివరాలకు 63096 74769 నంబర్లో సంప్రదించాలి. – సజీవన్,
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ అధికారి
పేద ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం
జిల్లాలోని నిరుపేద ఎస్సీ విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని కాగజ్నగర్లోని విశ్వశాంతి హైస్కూల్, కౌటాలలో ని మయూరి విద్యాలయాన్ని బెస్ట్ అవైలబు ల్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో ప్రవేశాల కోసం అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఐదో తరగతిలో (రెసిడెన్షియల్) 40 సీట్లు, ఒకటో తరగతిలో (నాన్ రెసిడెన్షియల్) 38 సీట్లు కేటాయించారు. నాలుగో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పేద ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం
జిల్లాలోని నిరుపేద ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని కాగజ్నగర్లోని విశ్వశాంతి హైస్కూల్, కౌటాలలోని మయూరి విద్యాలయాన్ని బెస్ట్ అవైలబుల్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో ప్రవేశానికి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఐదో తరగతిలో (రెసిడెన్షియల్) 40 సీట్లు, ఒకటో తరగతిలో (నాన్ రెసిడెన్షియల్) 38 సీట్లు కేటాయించారు. నాలుగో తరగతి పాసైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పేదోళ్లకు ‘బెస్ట్’ స్కూళ్లు

పేదోళ్లకు ‘బెస్ట్’ స్కూళ్లు