
హైవేతో మారుమూల ప్రాంతాల అభివృద్ధి
● వచ్చే నెల 5న జిల్లాకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ● పాల్వాయి హరీశ్బాబు
రెబ్బెన(ఆసిఫాబాద్): మంచిర్యాల టు మహారాష్ట్ర సరిహద్దు వరకు సుమారు రూ.3500 కోట్లతో నిర్మించిన హైవేతో మారుమూల ప్రాంతాలు అభివృద్ది చెందాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. జాతీయ రహదారి– 363ను ప్రారంభించేందుకు మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ జిల్లాకు రానున్నారని తెలిపారు. రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. సభాస్థలితోపాటు హెలిప్యాడ్ ప్రాంతాలను ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ అధికారులతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం మీదుగా నిర్మించిన జాతీయ రహదారితో జిల్లావాసులు హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మెరుగైన రోడ్డు సౌకర్యం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తోందని తెలిపారు. హైవే– 363 ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్తోపాటు ఎంపీ గోడం నగేశ్, స్థానిక శాసన సభ్యులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అధికారి మణికుమార్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా కోశాధికారి అరుణ్లోయ తదితరులు పాల్గొన్నారు.