డిగ్రీ కళాశాలలో ‘తొలిమెట్టు’
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం తొలిమెట్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మినర్సింహా మాట్లాడుతూ సామాజిక సేవలో భా గంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఆధ్వర్యంలో వి ద్యార్థుల కోసం తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఆ యా సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంపై అభినందించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తూడూరు ద త్తాత్రేయ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజు, జనార్ధన్, రాజేశ్వర్, డాక్టర్ టేమాజీ, సంతోష్, కోటేష్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.