
రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేసింది బీజేపీనే...
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేసింది బీజేపీయేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన సాధ్యమని పేర్కొంటూ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను బీజేపీ ఎంపీలు వినిపించారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు గెంట్యాల విద్యాసాగర్, సన్నే ఉదయ్ ప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు, మందడపు సుబ్బారావు, జ్వాలా నర్సింహారావు, అల్లిక అంజయ్య యాదవ్, రుద్ర ప్రదీప్, శ్యాంరాథోడ్, మందడపు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజలకు బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో...
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు గుండాల కృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. ఆతర్వాత పెవిలియన్ మైదానం సమీపాన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేసింది బీజేపీనే...