
కార్యకర్తల కోసం ప్రాణమైనా ఇస్తా..
నేలకొండపల్లి/కూసుమంచి: బీఆర్ఎస్ కార్యకర్తలను తన ప్రాణం అడ్డు వేసైనా కాపాడుకుంటానని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో సోమవారం జరిగిన సమావేవంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఎవరు వేధించినా సహించేది లేదని చెప్పారు. ఎదుటి వారు ఒక దెబ్బ కొడితే... తాము రెండు దెబ్బలు కొడతామని తెలిపారు. తన వద్ద డబ్బు లేకపోయినా చేతనైన మేర సాయం చేస్తానని, కనీసం రెండు శాతం మంది ప్రజలైనా తాను మంచి చేయలేదని చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్ల డించారు. కాగా, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా విజయం బీఆర్ఎస్నే వరిస్తుందని కందాళ ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్ మాజీ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్యతో పాటు నాగుబండి శ్రీనివాసరావు, కోటి సైదారెడ్డి, షేక్ హుస్సేన్, కమదన ప్రవీణ్, యాతాకుల భాస్కర్, గోలుసు రవి, మాదాసు ఆదాం, దాసరి ఉదయ్, దేవరశెట్టి మురళి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచి మండలం గంగబండ తండాలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి