‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’ విద్యార్థులకు అభినందన | - | Sakshi
Sakshi News home page

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’ విద్యార్థులకు అభినందన

Jun 3 2025 12:28 AM | Updated on Jun 3 2025 12:28 AM

‘న్యూ

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’ విద్యార్థులకు అభినందన

వైరా: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో వైరాలోని న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన వి.కుశాల్‌ 165, ఎం.నాగ యశ్వంత్‌ 393, రాహుల్‌దేవ్‌ 4,068 ర్యాంకులు సాధించగా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ సోమవారం అభినందించారు. కళాశాల కరస్పాడెంట్‌ డాక్టర్‌ పి.భూమేష్‌, డైరెక్టర్‌ సుమన్‌, ప్రిన్సిపాల్‌ భువనప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ

మధిర: జేఈఈ అడ్వా న్స్‌డ్‌ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్‌ జాతీయస్థాయిలో 3,354 ర్యాంక్‌ సాధించాడు. 1 – 10వ తరగతి వరకు మధిర శ్రీ చైతన్య పాఠశాలలో చదివిన ఆయన ఇంటర్‌లో వెయ్యికి 986 మార్కులతో ప్రతిభ చాటారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధించిన శశాంక్‌ను పలువురు అభినందించారు.

రహదారి మరమ్మతు చేయించాలని ఆందోళన

కామేపల్లి: మండలంలోని ముచ్చర్ల నుంచి ఏన్కూర్‌ వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైనా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యాన సోమవారం రాస్తారోకో చేశారు. నిమ్మవాగు సమీపాన చేపట్టిన ఆందోళనలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్‌ మాట్లాడుతూ.. కొత్త రహదారి నిర్మాణం మాటేమో కానీ కనీసం మరమ్మతు చేయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అనంతరం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యాన సైకిల్‌యాత్ర చేపట్టారు. నాయకులు భూక్యా వీరభద్రం, ప్రభాకర్‌, రమేశ్‌, కృష్ణ, శ్రీనివాసరెడ్డి, బాదావత్‌ శ్రీనివాస్‌, నవీన్‌, గిరిధర్‌, నర్సిరెడ్డి పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో ప్రతిభ

ఖమ్మంస్పోర్ట్స్‌: హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఖమ్మం మహబూబ్‌ కరాటే స్కూల్‌కు చెందిన పది మంది విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన ఎన్‌.నియాన్ష్‌, పి.కుశల్‌, ఉద్యాంష్‌దత్తా, పి.అక్షిత, సయ్యద్‌ అమీర్‌పాషా, ఆర్‌.శశి, ఎన్‌.శ్రీసాహిత్య, రూప, కె.గణేశ్‌, సయ్యద్‌ అదిల్‌పాషా పతకాలు గెలుచుకున్నారు. వీరిని కరాటే స్కూల్‌ మాస్టర్‌ ఎండీ మహబూబ్‌ తదితరులు అభినందించారు.

ఇక మరింత వేగం !

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో చెత్త సేకరణ, తరలింపునకు ఇప్పటివరకు పలు వాహనాలు ఉన్నాయి. అయితే, పారిశుద్ధ నిర్వహణ మరింత మెరుగుపడేలా కొత్తగా 19 ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు వంద రోజుల ప్రణాళిక అమలు మొదలుపెట్టిన సోమవారం ఈ ట్రాక్టర్లను మేయర్‌ పునుకొల్లు నీరజ, కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య ప్రారంభించారు. అనంతరం ఓ ట్రాక్టర్‌ను కమిషనర్‌ అభిషేక్‌ ఇలా స్టార్ట్‌ చేసి కార్పొరేటర్లు, ఉద్యోగులతో కలిసి విజయ సంకేతం చూపించారు.

జయరాజుకు

గుర్తింపుపై హర్షం

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ ప్రజా పోరాటానికి స్ఫూర్తిని అందించిన కవి, గాయకుడు, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు జయరాజును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి, రూ. కోటి నగదు అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. జయరాజు సింగరేణి కార్మిక ఉద్యమ నిర్మాతగా ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితులని కొనియాడారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో బాలోత్సవ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వాసిరెడ్డి రమేష్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య, ఆశ్రమం కో ఆర్డినేటర్‌ సుగుణారావు ఉన్నారు.

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’  విద్యార్థులకు అభినందన
1
1/3

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’ విద్యార్థులకు అభినందన

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’  విద్యార్థులకు అభినందన
2
2/3

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’ విద్యార్థులకు అభినందన

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’  విద్యార్థులకు అభినందన
3
3/3

‘న్యూలిటిల్‌ ఫ్లవర్స్‌’ విద్యార్థులకు అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement