
మార్కెట్ల లక్ష్యం ఖరారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా వసూలు చేయాల్సిన పన్నులకు సంబంధించి లక్ష్యాన్ని ఖరారు చేశారు. గత ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి ఆదాయం నమోదైంది. దీంతో 2025–26 సంవతసరానికి గాను జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ల ద్వారా రూ.69.37 కోట్ల వసూలుకు మార్కెటింగ్ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది.
గత ఏడాది లక్ష్యానికి మించి
ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్ధులపల్లిలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.63.15 కోట్ల లక్ష్యాన్ని విధించగా రూ.65.56 కోట్ల ఆదాయం నమోదైంది. దీంతో ఈసారి రూ.69.37 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. తద్వారా దాదాపు రూ.6 కోట్లు పెంచినట్లయింది. అయినప్పటికీ లక్ష్య సాధన కోసం మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నారు. మార్కెట్లలో వ్యాపారులు చేసే కొనుగోళ్లలో కొంత శాతం పన్ను రూపంలో వసూలు కానుంది. అలాగే, వివిధ ప్రాంతాల్లోని చెక్పోస్టుల ద్వారా సెస్ వసూలు చేయనున్నారు.
ఈ ఏడాది రూ.69.37 కోట్ల వసూళ్లకు ప్రణాళిక
గతేడాది కంటే రూ.6 కోట్ల పెంపు
మార్కెట్ల వారీగా గత ఏడాది, ఈ ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం (రూ.కోట్లలో)
మార్కెట్ గత ఏడాది ఈ ఏడాది
ఖమ్మం 30 35
మధిర 4.75 4.99
నేలకొండపల్లి 3.78 4
కల్లూరు 5.67 5.44
వైరా 6.73 6.29
ఏన్కూరు 4.87 4.95
సత్తుపల్లి 4.94 5.12
మద్దులపల్లి 3.15 3.21

మార్కెట్ల లక్ష్యం ఖరారు