మరిన్ని బడుల్లో ఏఐ | - | Sakshi
Sakshi News home page

మరిన్ని బడుల్లో ఏఐ

Jun 2 2025 12:30 AM | Updated on Jun 2 2025 12:30 AM

మరిన్

మరిన్ని బడుల్లో ఏఐ

విద్యార్థుల్లో సామర్ధ్యం పెంపు

కంప్యూటర్‌ ఆధారిత బోధనతో విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగయ్యాయి. పాఠశాలకు క్రమం తప్పకుండా రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లలు కంప్యూటర్‌ వినియోగిస్తుండడంతో

తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

– కె.రవికుమార్‌,

జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి

176 పాఠశాలల్లో ఏర్పాట్లు

జిల్లాలోని 176 పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత బోధన మొదలుపెడుతున్నాం. ఇప్పటికే అమలుచేసిన స్కూళ్లలో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో మరిన్ని పాఠశాలలకు విస్తరిస్తున్నాం.

– సామినేని సత్యనారాయణ,

జిల్లా విద్యాశాఖాధికారి

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు అనేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత విద్యాసంవత్సరం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత బోధన సాగించారు. జిలాల్లోని ఏడు పాఠశాలల్లో ఈ విధానం అమలుచేయగా సత్ఫలితాలు వచ్చాయని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఇంకా 176 పాఠశాలల్లో అమలుకు నిర్ణయించారు. – ఖమ్మం సహకారనగర్‌

అమలు ఇలా..

పేరున్న కార్పొరేట్‌ పాఠశాలల్లో మాత్రమే ఏఐ ఆధారిత బోధన కొనసాగుతోంది. దీన్ని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో తెలుగు, ఇంగ్లిష్‌, గణిత సామర్థ్యాలు పెంచేలా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయోగాత్మకంగా జిల్లాలోని ఏడు పాఠశాలలకు కంప్యూటర్లు సమకూర్చి 3 నుంచి 5 తరగతుల్లో పదేసి మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆపై ‘ఏక్‌ స్టెప్‌‘ ఫౌండేషన్‌ రూపొందించిన ప్రోగ్రాం ఆధారంగా రోజుకు 40 నిమిషాలు, వారానికి నాలుగు రోజులు కంప్యూటర్లతో బోధించారు. తద్వారా ప్రతీ విద్యార్థి కంప్యూటర్‌ను వినియోగిస్తూ ఉచ్ఛారణను రికార్డు చేయడమే కాక ఆపై మళ్లీ వింటూ తప్పొప్పులు సరిచేసుకున్నారు. ఖమ్మం ఎన్నెస్పీ కాలనీ, రాజేంద్రనగర్‌ ప్రభుత్వ పాఠశాలలు, మల్లెమడుగు, పాండురంగాపురం, సింగారెడ్డిపాలెం, సత్తుపల్లి, సిద్ధారంలోని మండల పరిషత్‌ పాఠశాలల్లో ఈ విధానం అమలుచేయగా విద్యార్థుల సామర్థ్యాలు పెరిగినట్లు గుర్తించారు.

తల్లిదండ్రులకు నివేదికలు

గత ఏడాది ఏఐ ఆధారిత బోధన సాగిన పాఠశాలల్లోని విద్యార్థుల ప్రగతిని రెండు సార్లు తల్లిదండ్రులకు అందించారు. ఈ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. అంతేకాక ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో నిలవగా ఉన్నతాధికారులు డీఈఓ సామినేని సత్యనారాయణకు ప్రశంసాపత్రం అందించారు. దీంతో ఈ ఏడాది 50కి మించి విద్యార్థులు ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఐదు చొప్పున కంప్యూటర్లు కేటాయించి విస్తరించాలని నిర్ణయించారు.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ

కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధనపై ప్రత్యేకదృష్టి సారించారు. జిల్లా కేంద్రంలోని ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో కొత్త విధానం అమలును తరచుగా పర్యవేక్షించిన ఆయన అధికారులకు సూచనలు చేశారు. దీంతో కార్యక్రమం సమర్థవంతంగా అమలైంది.

గత ఏడాది ఏడు పాఠశాలల్లో అమలు

విద్యార్థుల ఉత్సాహం..

మెరుగైన ఫలితాలు

ఈసారి కొత్తగా 176స్కూళ్లలో

ఏర్పాటుకు నిర్ణయం

ఇవీ లాభాలు

ఏఐ ఆధారిత బోధన ద్వారా తెరపై చూస్తూ పాఠాలు వింటుండడంతో విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా దోహదపడుతుందని భావిస్తున్నారు. అలాగే, కంప్యూటర్‌ విద్యపై భయం తగ్గుతుందని..

వెనకబడిన విద్యార్థులు సైతం చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు సులభంగా నేర్చుకున్నారని తేలింది. తెలివితేటలు, ఏకాగ్రత పెరిగి విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారని గుర్తించారు.

ఈ ఏడాది అమలు చేయనున్న స్కూళ్ల వివరాలు

నియోజకవర్గం పీఎస్‌లు యూపీఎస్‌లు మొత్తం

పాఠశాలలు

పాలేరు 40 08 48

మధిర 35 03 38

ఖమ్మం 35 02 37

వైరా 23 05 28

సత్తుపల్లి 21 04 25

మొత్తం 154 22 176

మరిన్ని బడుల్లో ఏఐ1
1/4

మరిన్ని బడుల్లో ఏఐ

మరిన్ని బడుల్లో ఏఐ2
2/4

మరిన్ని బడుల్లో ఏఐ

మరిన్ని బడుల్లో ఏఐ3
3/4

మరిన్ని బడుల్లో ఏఐ

మరిన్ని బడుల్లో ఏఐ4
4/4

మరిన్ని బడుల్లో ఏఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement