
వాతావరణ ం
జిల్లాలో సోమవారం ఎండ ప్రభావం పెరుగుతుంది. మధ్యాహ్నం వేళ వడగాలుల శ్రీప్రభావం సైతం ఉంటుంది.
త్వరలోనే
హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకానుంది. ఇన్నాళ్లు కాల్వొడ్డు తదితర ప్రాంతాల్లో పండ్లు అమ్ముతుండగా అమ్మకందారులే కాక ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన నగరంలోని 4వ డివిజన్ పారిశ్రామిక ప్రాంతంలో మూడేళ్ల నుంచి అసంపూర్తి నిర్మాణాలతో ఖాళీగా ఉన్న వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ షెడ్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. కొద్దిమేర మిగిలి ఉన్న పనులు పూర్తిచేసి హోల్సెల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది అమల్లోకి వస్తే నగరవాసులకు అన్ని రకాల పండ్లు ఒకే చోట లభించనున్నాయి. ఈకార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.
ప్రణాళికాయుతంగా పనులు
ఖమ్మంవన్టౌన్: జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రణాళికాయుతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధి కారులతో ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. రహదా రులపై ర్యాంప్ల నిర్మాణం, ఆక్రమణతో వెడల్పు తగ్గి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అయితే, అధికారులు తొలిదశలో అడ్డుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, వర్షాలు పడేనాటికి ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలని, విద్యుత్ లైన్ల ఏర్పాటులో ఉద్యోగులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.