కేన్సర్‌తో పోరాడి ఓడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి | - | Sakshi
Sakshi News home page

కేన్సర్‌తో పోరాడి ఓడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

Jun 1 2025 12:12 AM | Updated on Jun 1 2025 12:12 AM

కేన్సర్‌తో పోరాడి ఓడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

కేన్సర్‌తో పోరాడి ఓడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

రఘునాథపాలెం: కేన్సర్‌ను తుది దశలో గుర్తించినా, ధైర్యంగా చికిత్స చేయించుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన పోరాటంలో ఓడిపోయారు. మండలంలోని కోయచలకు చెందిన మాదంశెట్టి సత్యగోపాల్‌ (34) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవారు. ఆయనకు కేన్సర్‌ సోకిన ట్లు తెలియడంతో మూడేళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. అయినా ఫలితం లేక శనివా రం ఉద యం మృతి చెందాడు. కాగా, సత్యగోపాల్‌ సోదరుడు రాంబాబు అన్న కోసం ఉద్యోగం వదిలిపెట్టి చికిత్సకు చేయూతగా నిలవగా, చివరకు సోదరుడు కన్నుమూయడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు సత్యగోపాల్‌ అంత్యక్రియలకు కుటుంబీకులు, స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్‌ మృతి

వైరారూరల్‌: వైరా సమీపాన బ్రిడ్జిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీడ్రైవర్‌ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఇనుప చువ్వల లోడుతో వైరా వైపు నుంచి తల్లాడ వైపు లారీ వెళ్తుండగా డీసీఎం వ్యాన్‌ను, ఆ తర్వాత కారును ఢీకొన్న విషయం విదితమే. ఈ ఘటనలో లారీడ్రైవర్‌ షేక్‌మహబూబ్‌ సుభానీ అలియాస్‌ మున్నా(32)కు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా శనివారం మృతి చెందాడు. ఆయన స్వగ్రామం విజయవాడ కాగా భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారని ఎస్‌ఐ పి.రామారావు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం

వేంసూరు: అప్పుల పెరగడం, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేంసూరు మండలం వెంకటాపురానికి చెందిన షేక్‌ నాగుల్‌మీరా (37) భార్యతో కలిసి చికెన్‌ షాప్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిస కావడంతో అప్పులు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా డు. శనివారం నాగుల్‌మీరా భార్య షాకీనా ఆస్పత్రికి వెళ్లగా ఆయన ఉరి వేసు కున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబీకులు గుర్తించి సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆయనకు భార్య తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని సుద్దవాగుతండాకు చెందిన బానోతు శ్రీనివాస్‌(42) మోటార్‌సైకిల్‌పై శనివారం రాత్రి సోలీపురం నుంచి కాకరవాయి వస్తుండగా కింద పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, శ్రీనివాస్‌ను ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టిందా లేదా గేదెను తగిలి పడ్డాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య బుజ్జితో పాటు ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పేకాటరాయుళ్లపై కేసు

బోనకల్‌: మండలంలోని రావినూతలలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిపై కేసు నమోదుచేసి రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ పి.వెంకన్న తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement