కల్లూరు.. ఇకపై మున్సిపాలిటీ! | - | Sakshi
Sakshi News home page

కల్లూరు.. ఇకపై మున్సిపాలిటీ!

May 31 2025 12:26 AM | Updated on May 31 2025 12:26 AM

కల్లూరు.. ఇకపై మున్సిపాలిటీ!

కల్లూరు.. ఇకపై మున్సిపాలిటీ!

కల్లూరు: కల్లూరు మేజర్‌ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ కొన్నాళ్ల క్రితం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఇకపై కల్లూరు మున్సిపాలిటీగా మనుగడలోకి రానుంది. అంతేకాక ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా మధిర మున్సిపల్‌ కమిషనర్‌ అరెగెల సంపత్‌కుమార్‌ నియమించగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అలాగే, స్పెషల్‌ ఆఫీసర్‌గా ఇల్లెందు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ను కేటాయించారు. కల్లూరును మున్సిపాలిటీ అప్‌గ్రేడ్‌ చేయాలని స్థానికులతో పాటు ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి వినతితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదింపజేశారు. కప్పలబంధం, పుల్లయ్యబంజర, తూర్పు లోకవరం, పడమర లోకవరం, కిష్టయ్యబంజర, హనుమాతండా, వాచ్చానాయక్‌ తండాల విలీనంతో కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈమేరకు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంపత్‌కుమార్‌ను పంచాయతీ ఈఓ నందిశెట్టి నాగేశ్వరరావు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా సంపత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement