విలువలు కలిగిన నేత పోటు ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

విలువలు కలిగిన నేత పోటు ప్రసాద్‌

Jun 3 2025 12:28 AM | Updated on Jun 3 2025 12:28 AM

విలువలు కలిగిన నేత పోటు ప్రసాద్‌

విలువలు కలిగిన నేత పోటు ప్రసాద్‌

ఖమ్మంఅర్బన్‌: సమకాలీన రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నేతగా పోటు ప్రసాద్‌ నిలిచిపోతారని, ఆయన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేశారని సీపీఐ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. ఇటీవల మృతి చెందిన సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌ స్మారక స్థూపాన్ని ఖమ్మం ఇందిరానగర్‌ వద్ద ఖానాపురం హవేలీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేయగా సోమవారం పువ్వాడ ఆవిష్కరించి మాట్లాడారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐటీయూసీ, సీపీఐలో కీలకపాత్ర పోసించిన ప్రసాద్‌ అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, దండి సురేష్‌, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌.కే.జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, పోటు కలావతి, మహ్మద్‌ సలాం, తాటి వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, వరదా నర్సింహారావు, పగడాల మల్లేష్‌, మేకల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

స్తూపాన్ని ఆవిష్కరించిన సీపీఐ నేత పువ్వాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement