
అర్హులందరికీ సంక్షేమమే లక్ష్యం
బోనకల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. బోనకల్ మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. గార్లపాగు నుంచి రామాపురం మీదుగా చింతకాని మండలం నాగులవంచ వరకు రూ.2.23కోట్లతో చేపట్టే రోడ్డు మరమ్మతు పనులు, చిన్నబీరవల్లి నుండి నారాయణపురం వరకు రూ.4.50కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు మరమ్మతుతో పాటు బోనకల్ ఇందిరా డైరీ నుంచి రావినూతల వరకు రూ.2.76కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేస్తూనే, స్వయం ఉపాధి పథకాల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. కాగా, వర్సాలు మొదలైనందున రైతులకు కావాల్సిన విత్తనాలను సమకూరుస్తున్నామని చెప్పారు. అయితే, నకిలీ విత్తనాల విషయంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, ఎస్ఈ గుర్రాల వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీర్ మహేష్బాబు, డీఈ కోటేశ్వరావు, ఏఈఈ నవీన్కుమార్, తహసీల్ధార్ రమాదేవి, ఎంపీడీఓ రమాదేవి, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు పైడిపల్లి కిశోర్, గాలి దుర్గారావు, పిల్లలమర్రి నాగేశ్వరావు, బోయినపల్లి వెంకటేశ్వర్లు, మోదుగు సుధీర్బాబు, ఎర్రంశెట్టి సుబ్బారావు, మరీదు శ్రీను, గత్తం బాలరాజు, చేబ్రోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రూ.9.49కోట్ల విలువైన
రోడ్ల పనులకు శంకుస్థాపన