ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కృషి

May 27 2025 12:21 AM | Updated on May 27 2025 12:21 AM

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కృషి

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కృషి

ఖమ్మంసహకారనగర్‌: అన్ని వసతులు, నాణ్యమైన బోధన అందుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, తద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు కోసం యూటీఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచార జాతాను ఖమ్మంలో సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు ఉండడమే కాక ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్‌, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అందుతాయని తెలిపారు. కాగా, తొలిరోజు ఖమ్మంలోని వైరా రోడ్డు, పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఇల్లెందు క్రాస్‌ రోడ్డు తదితర ఏరియాల్లో ప్రచార జాతా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్‌, పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బానోత్‌ రాందాస్‌, లివిన్‌ స్టన్‌, ధర్మసోత్‌ నాగేశ్వరరావు, పినపాక సురేష్‌, కట్టా పద్మ, వి.దామోదర్‌, ఉద్దండ్‌, మంగీలాల్‌, నెల్లూరి వీరబాబు, ఏడునూతల రవికుమార్‌, జి.బిక్షపతి, యు.నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్‌, శివకోటి తదితరులు పాల్గొన్నారు.

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement