ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

May 27 2025 12:21 AM | Updated on May 27 2025 12:21 AM

ఎస్సై

ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

తిరుమలాయపాలెం: చోరీ కేసులో వివక్ష ప్రదర్శించి తన కుమారుడు దారమల్ల సందీప్‌ ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఎస్‌ఐతో పాటు ఎర్రగడ్డ గ్రామానికి చెందిన అభిలాష్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన తండ్రి తిరుప య్య కోరారు. ఈసందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు అందజేశారు. చోరీకేసులో ఇతర కులస్తులు ఉన్నా తన కుమారుడిని బెదిరించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు ఎస్సైపై చర్యలు తీసుకోవడమే కాక తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించూలా చూడాలని కోరారు.

తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

వైరా: రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడమే కాక అభివృద్ధి పనులకు తగిన నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వైరాలో సోమవారం జరిగిన పార్టీ డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 నెలలుగా గ్రామాల్లో పాలక మండళ్లు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అందడం లేదని తెలిపారు. ఫలితంగా సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని సూచించారు. అలాగే, సీతారామ ప్రాజెక్ట్‌ నిర్మాణం వేగంగా జరిగేలా నిధులు కేటాయించాలని, కారేపల్లి, కామేపల్లి ఏజెన్సీ మండలాలకు సాగు నీరు అందేలా చూడాలని కోరారు. సీపీఎం వైరా డివిజన్‌ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతున్నందున నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా నిఘా పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు మచ్చా మణి, సుంకర సుధాకర్‌, తాళ్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ, కొండెబోయిన నాగేశ్వరరావు, తోట నాగేశ్వరరావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, కె.నరేంద్ర, కుటుంబరావు, శ్రీనివాసరెడ్డి, రామారావు, బాలాజీ, శ్రీనివాస్‌, తాతా పద్మ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

కూసుమంచి: కూసుమంచికి చెందిన భోగి శ్రీకాంత్‌(28) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భోగి వెంకన్న ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన శ్రీకాంత్‌ తండ్రితో ఉంటున్నాడు. ఆయన సోదరులకు వివాహాలు కాగా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఈక్రమాన శ్రీకాంత్‌, ఆయన తండ్రి ఆదివారం రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీకాంత్‌ సోదరుడి భార్య కూసుమంచి రాగా, ఇంటి తలుపులు వేసి ఉండడంతో బలంగా శబ్దం చేయడంతో మామ వెంకన్న తలుపులు తెరిచాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా చాపపై కింద పడుకున్న శ్రీకాంత్‌ విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. కాగా, శ్రీకాంత్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆయన సోదరుడు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అర్హులైన గిరిజనులంతా లబ్ధి పొందాలి

భద్రాచలం: అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా, వారు లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించాక మాట్లాడారు. అర్హతల మేరకు దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. గిరిజనులు సైతం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు. కాగా, టేకులపల్లి మండలం మూర్తులతండాకు చెందిన లక్ష్మయ్య తమ పొలంలో బోరు బావికి, పెనుబల్లి మండలం గట్టిగూడెంకు చెందిన నాగేశ్వరరావు కరెంటు మోటారుకు, జూలూరుపాడు మండలం కర్రెవారి గూడెంకు చెందిన రాంబాబు ట్రైకార్‌ రుణం కోసం, అశ్వారావుపేట మండలం అయ్యవారిగూడెంకు చెందిన కృష్ణ రోడ్లు, కరెంటు ఏర్పాట్లకు, పాల్వంచ మండలం పునుకుల గ్రామానికి చెందిన వెంకటమ్మ క్రాప్‌ లోన్‌ కోసం దరఖాస్తులు సమర్పించారు. ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు1
1/1

ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement