డాక్టర్‌ రాగమయి ! | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రాగమయి !

May 27 2025 12:21 AM | Updated on May 27 2025 12:21 AM

డాక్టర్‌  రాగమయి !

డాక్టర్‌ రాగమయి !

సత్తుపల్లి: నిత్యం తనిఖీలు, సమీక్షలతో గడిపే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి సోమవారం స్టెతస్కోప్‌ పట్టుకున్నారు. సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఆమె నర్సింగ్‌ కళాశాల, అంబేద్కర్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆతర్వాత మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి శిశువులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశాక కొందరు చిన్నారులను స్వయంగా పరీక్షించారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు గాదె చెన్నారావు, ఎం.డీ.కమల్‌పాషా, పింగళి సామేలు, జీవన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement