పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

May 7 2025 12:13 AM | Updated on May 7 2025 12:13 AM

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

● రాజీవ్‌ యువ వికాసంలో 1:2 నిష్పత్తిలో జాబితా ● కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ మండలంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలద్వారా వచ్చి న దరఖాస్తులపై ఆరా తీశాక ఆయన మాట్లాడుతూ పరిశీలన 90 శాతం పూర్తయిందని, తుది జాబి తాపై తయారీపై దృష్టి సారించాలని తెలిపా రు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ల లక్ష్యం మేరకు 1:2 నిష్పత్తిలో జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. దివ్యాంగులు, మహిళలు, అతి పేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్‌ సూచించారు.

నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు

ఖమ్మంగాంధీచౌక్‌: అర్హులైన వారికి నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ శ్రీజతో కలిసి ఇళ్ల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై అధికా రులతో సమీక్షించారు. పైలట్‌ గ్రామాల్లో 878 ఇందిరమ్మ ఇళ్లకు గాను 370 మందికి మొదటి విడత రూ.లక్ష నిధులు వచ్చాయన్నారు. మిగతాచోట్ల పనుల్లో వేగం పెరిగేలా పర్యవేక్షిస్తూ, ఇతర ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికపై సూచనలు చేశారు. మండల కేంద్రాల్లో నిర్మించిన మోడల్‌ ఇళ్ల వద్దకు మేసీ్త్రలను తీసుకెళ్లి తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాకు 14,763 ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తే, 10,921 దరఖాస్తుల ఆధారంగా 9,150 మందిక అర్హులుగా గుర్తించినందున మరోమారు పరిశీలించాలని ఆదేశించారు. ఈసమావేశాల్లో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ సత్యనారాయణ, కల్లూరు ఆర్డీఓ రాజేందర్‌, హౌసింగ్‌ ఈఈ బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చివరి గింజ వరకు కొనుగోళ్లు

ఖమ్మంరూరల్‌: రైతులు యాసంగిలో సాగు చేసిన ధాన్యంలో చివరి గింజ వరకు నాణ్యత ఆధారంగా కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ తెలి పారు. ఖమ్మం రూరల్‌ మండలం గుదిమళ్లలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులతో మాట్లాడారు. సరైన తేమ శాతం రాగానే కాంటా వేసి మిల్లులకు తరలించాలని, ఎక్కడా తరుగు తీయకుండా పర్యవేక్షించాలని ఉద్యోగులకు సూచించారు. కాల వర్షాల నేపథ్యాన కొనుగోళ్లలో వేగం పెంచి అదనంగా హమాలీలు, వాహనాలను సమకూర్చుకోవాలని తెలిపారు.

మామిడి మార్కెట్‌లో పరిశీలన

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం రోటరీనగర్‌లోని వీధి వ్యాపారుల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు మామిడి మార్కెట్‌ను కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ పరి శీలించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సహజసిద్ధంగా పండించిన పండ్లే విక్రయించేందుకు ఈ మా ర్కెట్‌ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం. వీ.మధుసూదన్‌, ఉద్యాన అధికారి అనితశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement