
జూనియర్ సివిల్ జడ్జిగా చరణ్తేజ
ఖమ్మం లీగల్: ఖమ్మంకు చెందిన న్యాయవాది కోటి రామకృష్ణ కుమారుడు చరణ్తేజ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. పదో తరగతి వరకు ఖమ్మంలోని న్యూ ఎరా స్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో పూర్తిచేసిన ఆయన హైదరాబాద్లోని పెండేకంటి లా కాలేజీ న్యాయవాద విద్య చదివారు. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో ఆయన జడ్జిగా ఎంపిక కాగా, శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ను కలవగా చరణ్తేజను సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.వెంకటేశ్వరరావు, జి.దిలీప్కుమార్ తదితరులు ఆయనను అభినందించారు.
జమలాపురంలో
ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి మూలవిరాట్తో పాటు ఆలయంలో శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించగా తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతినిలయంలో
సీడబ్ల్యూసీ చైర్పర్సన్
బోనకల్: మండల కేంద్రంలో మానసిక దివ్యాంగులకు ఆశ్రయం ఇస్తున్న శాంతి నిలయాన్ని శనివారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్యూసీ) చైర్పర్సన్ భారతీరాణి సందర్శించారు. పిల్లల ఆరోగ్యం, వారికి అందిస్తున్న సౌకర్యాలపై నిర్వాహకురాలు ఆల్పీతో ఆరాతీయడమే కాక రికార్డులు పరిశీలించారు. పిల్లలందరికీ ఆధార్కార్డులు ఉన్నందున సదరం సర్టిఫికెట్లు ఇప్పించాలని నిర్వాహకులు కోరారు.
కుర్నవల్లి సొసైటీ
సీఈఓపై వేటు
రైస్మిల్లు షెడ్డు కూలిన ఘటనతో చర్యలు
తల్లాడ: తల్లాడ మండలంలోని కుర్నవల్లి సొసైటీ సీఈఓ వగ్గు నరసింహారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార శాఖాదికారి బి.గంగాధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ ఆధ్వర్యాన రూ.92 లక్షలతో రైస్ మిల్లు నిర్మించారు. ఇందులో షెడ్డుకు రూ.52లక్షలు వెచ్చించగా.. గత నెలాఖరులో వచ్చిన గాలిదుమారానికి మిల్లు మొత్తం కూలిపోయింది. దీంతో నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కుర్నవల్లికి చెందిన అన్నెం కోటారెడ్డి, తదితరులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ అధికారులు విచారణ చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చినట్లు సమాచారం. ఈమేరకు సీఈఓ నరసింహారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీసీఓ ఉత్తర్వులు జారీ చేయగా, మరికొందరిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
నేడు నెట్బాల్ ఎంపిక పోటీలు
ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ నెట్బాల్ బాలబాలికల జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు దీప్తి తెలిపారు. ఖమ్మంరూరల్ మండలం పెద్ద వెంకటగిరిలో జరిగే పోటీలకు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రంతో రావాలని సూచించారు. వివరాలకు 91338 94967నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

జూనియర్ సివిల్ జడ్జిగా చరణ్తేజ

జూనియర్ సివిల్ జడ్జిగా చరణ్తేజ