వైరా: అన్నదాతలకు ఆదెరువుగా, మత్స్యకారులకు అండగా నిలుస్తున్న నిండా నీరు ఉండగా.. చేపలు పట్టడం సాధ్యం కావడం లేదని కాంట్రాక్టర్ నీరు విడుదల చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలోని నల్ల చెరువు నీటిని అనుమతి కాంట్రాక్టర్ చేపల వేట కోసం వదిలినట్లు సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులో 3.5 అడుగుల మేర నీరు ఉంది. అయితే, నీరు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారుల అనుమతి అవసరం కాగా, అదేమీ లేకుండా మూడు రోజులుగా నీటిని వృథాగా విడుదల చేయడంతో చెరువు ఖాళీ అయ్యే స్థితికి చేరింది. మత్స్య సొసైటీ అధ్యక్షుడు, కాంట్రాక్టర్తో కుమ్మకై ్క ఈ ఘటనకు పాల్పడినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అలాగే, సుమారు 250 ఎకరాల మేర వరి నాట్లకు ఇబ్బంది ఏర్పడనుందని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల శాఖ, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఈ విషయమై ఐబీ డీఈ శ్రీనివాస్ను వివరణ కోరగా చెరువులో చేపల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు నీరు వదిలినట్లు ఆలస్యంగా తెలి సిందని, బాధ్యులను గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం చెరువు వద్ద లష్కర్లతో పహారా ఏర్పాటు చేశామని వెల్లడించారు