ప్రైవేట్‌ పాఠశాలల సత్తా | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ పాఠశాలల సత్తా

May 1 2025 1:13 AM | Updated on May 1 2025 1:13 AM

ప్రైవ

ప్రైవేట్‌ పాఠశాలల సత్తా

ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలోని పలు ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈమేరకు విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాలు అభినందించి వివరాలను వెల్లడించాయి. – ఖమ్మం సహకారనగర్‌

న్యూవిజన్‌ విజయదుందుభి

ఎస్సెస్సీ పరీక్షలకు తమ పాఠశాల నుంచి 494మంది హాజరుకాగా, 184మంది 600 మార్కులకు గాను 550కి పైగా మార్కులు సాధించారని న్యూవిజన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ సీహెచ్‌జీకే.ప్రసాద్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ సీహెచ్‌.కార్తీక్‌, డైరెక్టర్‌ గోపీచంద్‌ తెలిపారు. అలాగే, 500 – 449 మధ్య మార్కులు 215 మంది సాధించగా, మిగిలిన వారంతా 400కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. 52 మంది విద్యార్థులు గణితంతో వంద మార్కులు సాధించారన్నారు. పాఠశాల ప్రిన్సిపాళ్లు ఎం.డీ.ఆబాద్‌ అలీ, జే.వీ.మైఖేల్‌ తదితరులు పాల్గొన్నారు.

హార్వెస్ట్‌ విజయభేరి

పదో తరగతిలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హార్వెస్ట్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ పి.రవిమారుత్‌, ప్రిన్సిపాల్‌ పార్వతిరెడ్డి తెలిపారు. జి.జ్యోత్స్న 565మార్కులు, జి.సుభాష్‌చంద్ర 564, కె.జస్విత 561, డి.వేదర్ష 558, ఎ.మౌక్తిక 557, జె.సంపత్‌కుమార్‌ 557మార్కులు సాధించగా.. 59మంది విద్యార్థులు 500కిపైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలల సత్తా1
1/2

ప్రైవేట్‌ పాఠశాలల సత్తా

ప్రైవేట్‌ పాఠశాలల సత్తా2
2/2

ప్రైవేట్‌ పాఠశాలల సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement