ఎంతమంది బాలలు గాయపడ్డారు? | - | Sakshi
Sakshi News home page

ఎంతమంది బాలలు గాయపడ్డారు?

Jun 13 2025 4:49 AM | Updated on Jun 13 2025 4:49 AM

ఎంతమంది బాలలు గాయపడ్డారు?

ఎంతమంది బాలలు గాయపడ్డారు?

దొడ్డబళ్లాపురం/ బనశంకరి: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన బాలల వివరాలను అందించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ గురువారం నోటీస్‌ జారీచేసింది. ఆర్‌సీబీ విజయోత్సవాల సమయంలో స్టేడియంలో చాలామంది పిల్లలు ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. సుమోటో గా కేసు నమోదు చేసిన బాలల హక్కుల కమిషన్‌ దీనిపై సమగ్ర సమాచారం అందించాలని నగర పోలీసులకు నోటీస్‌ జారీచేసింది. ఆ రోజు పెద్దఎత్తున పిల్లలు ఉండటంతో చాలామంది గాయపడినట్లు సమాచారం.

హక్కుల కమిషన్‌కు లేఖ

తొక్కిసలాటలో మృతిచెందిన, గాయపడిన కుటుంబాలకు న్యాయం చేయాలని బీజేపీ పక్ష నేత ఆర్‌ అశోక్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది, చిన్నస్వామి స్టేడియంలోకి 35 వేలమంది మాత్రమే వెళ్లవచ్చు. అయితే ఉచిత పాస్‌,అసత్య ప్రకటనల వల్ల లక్షలాదిగా జనం వచ్చారు. పోలీసులు, భద్రతా వ్యవస్థ కొరవడి దారుణం జరిగిందని ఆరోపించారు.

ఆర్‌సీబీ ప్రతినిధులకు బెయిలు

ఆర్‌సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ నిఖిల్‌ సోసలెకి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. తొక్కిసలాట ఘటనలో పోలీసులు నిఖిల్‌ సోసలెను అరెస్టు చేశారు. ఈయనతో పాటు అరైస్టెన ఆర్సీబీకి చెందిన సునీల్‌ మ్యాథ్యూ, కిరణ్‌ కుమార్‌, శమంత్‌ మావినకెరెకు కూడా బెయిలు మంజూరు చేసింది.

తొక్కిసలాట ఘటనపై బాలల

కమిషన్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement