పోలీసు అధికారులపై చర్య మంచిదే | - | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులపై చర్య మంచిదే

Jun 8 2025 12:42 AM | Updated on Jun 8 2025 12:42 AM

పోలీసు అధికారులపై చర్య మంచిదే

పోలీసు అధికారులపై చర్య మంచిదే

హుబ్లీ: ఆర్‌సీబీ విజయోత్సవ వేళ జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకుల మృతి దురుదృష్టకరం అని, విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం మంచి నిర్ణయమే అని విధాన పరిషత్‌ స్పీకర్‌ బసవరాజ్‌ హొరట్టి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విషాద ఘటన నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌తో పాటు పలువురికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత అనుభవంలో ఇలాంటి దురంతం చూడలేదన్నారు. అలాగే పోలీస్‌ కమిషనర్‌ వంటి ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేయడం ఇదే తొలిసారిగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం అన్నారు. అర్ధరాత్రి ఈ నిర్ణయం తీసుకొని కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించడం వల్లే ఈ దురంతం జరిగిందన్నారు. తగినంత గడువు తీసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందన్నారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన దేశానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మరింతగా దృష్టి సారించాల్సిందన్నారు. అంతేగాక సంబంధించిన వారితో మాట్లాడి అవకాశం ఇవ్వాల్సింది. ప్రభుత్వంలో క్రికెట్‌ మండలి తప్పు కూడా ఉంది. ఈ ఘటన నేపథ్యంలో క్రికెట్‌ మండలికి వ్యతిరేకంగా పలు కేసులు పెట్టాలి. మొత్తం దేశంలో క్రికెట్‌పై అతి పిచ్చి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement