మారణకాండకు వారే బాధ్యులు | - | Sakshi
Sakshi News home page

మారణకాండకు వారే బాధ్యులు

Jun 7 2025 1:06 AM | Updated on Jun 7 2025 1:06 AM

మారణకాండకు వారే బాధ్యులు

మారణకాండకు వారే బాధ్యులు

సాక్షి,బళ్లారి: ఇటీవల బెంగళూరులో జరిగిన ఆర్‌సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకుల చావుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, హోంమంత్రి పరమేశ్వర్‌లే కారణమని, వారు నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల అభిమానులు ప్రాణాలు కోల్పోయారని, ఆ ముగ్గురిపై కేసులు పెట్టి తక్షణం వారిని అరెస్ట్‌ చేయాలని, వారు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. క్రికెట్‌ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత వెంటనే విజయోత్సవ ర్యాలీని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ఆలస్యంగా జరుపుకుని ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. ఈ ఘటనపై పోలీసు అధికారులను బాధ్యులను చేసి, వారిని సస్పెండ్‌ చేసినంత మాత్రాన పాపం పోదని, తమ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. తూతూమంత్రంగా నామమాత్రపు పరిహారం ప్రకటించడం సరికాదన్నారు.

గవర్నర్‌నూ అవమానించారు

ఆర్‌సీబీ విజయోత్సవంలో గవర్నర్‌కు ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాధారణంగా ఏదైనా సమావేశంలో ప్రారంభానికి ముందు గవర్నర్‌ వస్తారని, అయితే గవర్నర్‌ను అందరి కంటే ముందే పిలిచి ఆయన్నే వేచి ఉండే విధంగా చేసి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై ఎ1గా సీఎం, ఎ2గా డీసీఎం, ఎ3గా హోంమంత్రి పేర్లను నమోదు చేసి అరెస్ట్‌ చేయాలన్నారు. ఆర్‌సీబీ ఘటనలో జరిగిన లోపాలపై చర్చించేందు కోసం అసెంబ్లీ సమావేశాలు జరపాలన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు అల్లు అర్జున్‌ సినిమా విడుదల రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందితే ఆ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్‌పై కేసు పెట్టి అరెస్ట్‌ చేశారని, అక్కడ కాంగ్రెస్‌ సర్కారే పాలనలో ఉందని, ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మరి తొక్కిసలాటలో 11 మంది మృతి చెందితే సీఎం, డీసీఎం, హోంమంత్రిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి, పదవుల నుంచి ఎందుకు తప్పించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మేయర్‌, పాలికె ప్రతిపక్ష నేత ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు కే.ఎస్‌.అశోక్‌, మోత్కూరు శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆ 11 మంది చావుకు వారే బాధ్యత వహించాలి

సీఎం, డీసీఎం, హోంమంత్రి రాజీనామా చేయాలి

ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీరాములు నిప్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement