
ఊపిరాడక.. శ్వాస ఆగింది
తొక్కిసలాట మృతుల పోస్టుమార్టంలో వెల్లడి
కొందరికి ఎముకల ఫ్రాక్చర్లు
శివాజీనగర: తొక్కిసలాట దుర్ఘటనలో అనేకమంది శ్వాస అందక మృతిచెందినట్లు పోస్టుమార్టంలో ప్రాథమికంగా తెలిసింది. మృతదేహాలకు ఆస్పత్రుల్లో మరణోత్తర పరీక్షలు జరిపి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడమైనది. బయటకు వెళ్లినవారు శవాలుగా చేతికి అందడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరుమని రోదించారు. తమవారిని ప్రాణాలతో తెచ్చివాలని శోకించారు. జనం ఒకరిమీద ఒకరు పడడంతో చాలామందికి ఊపిరి ఆడలేదు, దీనివల్లే చనిపోయారు అని వైద్యనిపుణులు నివేదికల్లో పేర్కొన్నారు.
మృతుల్లో కొందరికి ఎముకలు విరిగిపోయాయి, అంతకుమించి ప్రత్యేక కారణాలు కనిపించలేదు. బౌరింగ్ ఆసుపత్రిలో 6 శవాలు, విక్టోరియా ఆసుపత్రిలో 5 మృతదేహాలకు పోస్టుమార్టం జరిపారు. తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడుస్తూ మృతదేహాలను ఇళ్లకు తీసుకొని వెళ్లిన దృశ్యాలు అందరి మనస్సును కలసివేశాయి. తొక్కిసలాటలో గాయపడినవారు 56 మంది నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 6 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఎంతో జీవితం.. కడతేరింది
చిన్నస్వామి స్టేడియం ముందు తొక్కిసలాటలో మృతుల వివరాలు వెలువడ్డాయి. 11 మంది మరణించడం తెలిసిందే. వీరిలో ఎక్కువగా ఇతర ప్రాంతాలవాసులు ఉన్నారు. అయితే బెంగళూరులోనే ఉంటూ, చదువుకుంటూ, ఉద్యోగాలు చేసేవారు. చిన్న వయసులోనే మృత్యువు పాలయ్యారు.
కబ్బన్పార్క్ ఠాణాలో కేసు
మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 194 క్రింద కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లో కేసులను నమోదు చేశారు.

కామాక్షిదేవి

అక్షతా పాయ్

చిన్మయ శెట్టి