
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
రాయచూరు రూరల్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లాధికారి నితీస్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. వేసవిలో మూడు నెలల పాటు ప్రజలు తాగునీటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్లతో నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. మస్కి తాలుకాల్లో 3380318130, 9606399118లకు ఫోన్ చేస్తే నీటి సమస్యలను పరిష్కరిస్తారన్నారు.
నీటి సరఫరా పనులకు నిధులివ్వండి
రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు చేయాలని బీదర్ దక్షిణ క్షేత్రం శాసన సభ్యుడు శైలేంద్ర బెల్దాళ్ విజ్ఞప్తి చేశారు. ఈమేకు అదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేలకు లేఖలు రాశారు. ప్రతి తాలూకాకు రూ.కోటి నిధులు మంజూరు చేయాలని కోరారు.
భీమా నదిలో
స్వచ్ఛతా పనులు
రాయచూరురూరల్: భీమా నదిలో స్వచ్ఛతకు యువ బిగ్రేడ్ శ్రీకారం చుట్టింది. బిగ్రేడ్ సంచాలకుడు రాజేంద్ర అద్వర్యంలో 15 మందితో కూడిన బృందం కలబుర్గి జిల్లా అప్జల్ పూర్ వద్ద నదిలో ఆదివారం చెత్తా చెదారం, ముళ్ల కంప చెట్లు, పిచ్చి మెక్కలను తొలగించారు.
ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులకు ఉన్నతి
హొసపేటె: ఒక విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నుంచి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల వరకు కృషి అవసరమని ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ అన్నారు. తాలూకాలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1998–1999 విద్యా సంవత్సరం విద్యార్థులు ఆదివారం నిర్వహించిన గురు వందన, స్నేహ సమ్మిలన్ రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత పదవులు చేపట్టి మా అందరికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో బోధించడంలో నిర్లక్ష్యం వహిస్తే, అది ఒక తరం విద్యార్థులను నాశనం చేసినట్లే అవుతుందని రిటైర్డ్ టీచర్ శారద దేవి అన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, అవి మూతపడుకుండా చూసుకోవడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ●
● మంత్రి శరణు ప్రకాశ పాటిల్
● మాన్విలో విధానసౌధ నిర్మాణానికి భూమిపూజ
రాయచూరు రూరల్: జిల్లాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శరణు ప్రకాశ పాటిల్ అన్నారు. శనివారం సాయంత్రం మాన్విలో మినీ విధానసౌధ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ప్రామాణికంగా పనిచేయాలన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మంత్రాలయం అంజనాద్రి, హులిగి, హోస్పేట్ ప్రాంతాలకు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. రాష్ట్ర చిన్న నీటిపారుదలశాఖ మంత్రి భోసురాజ్, మాన్వి శాసనసభ్యుడు హంపయ్య నాయక్, గ్రామీణ ఎమ్మెల్యే బసన గౌడ దద్దల్, బాలస్వామికోడ్లి, చంద్ర శేఖర్, మీనాక్షి, లక్ష్మి పాల్గొన్నారు.

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు చర్యలు