
హోమంలో పాల్గొన్న రాంబాబు దంపతులు
బనశంకరి: శ్రీ శివబాలయోగి మహారాజ్ మహాసమాధి 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జేపీ.నగర మూడోపేజ్లోని శ్రీశివబాలయోగి మహారాజ్ ట్రస్ట్ ఆశ్రమంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పూజలు, హోమాలు నిర్వహించారు. 12 గంటలకు ట్రస్ట్ కార్యాధ్యక్షుడు డీ.రాంబాబు దంవతులు, ట్రస్ట్ సభ్యులు, ఆలయ అర్చకులు బృందం పుర్ణాహుతి చేపట్టారు. 12.30 కుంభాభిషేకం, 1.30 భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం, 6.30 నుంచి 8 గంటల వరకు భజనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆరాధన మహోత్సవంలో పాల్గొన్నారు.