ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ ప్రారంభం

May 2 2025 1:17 AM | Updated on May 2 2025 1:17 AM

ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ ప్రారంభం

ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ ప్రారంభం

● సమస్యల పరిష్కారమే ధ్యేయం ● నుస్తులాపూర్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

తిమ్మాపూర్‌: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆన్‌వీల్స్‌ కార్యక్రమాన్ని ప్రా రంభించామని మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామంలో గురువారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇక ముందు ఉండబోదన్నారు. వారానికి మూడు రోజులు అధికారుల బృందంతో ఆయా గ్రామా ల ప్రజల వద్దకు వెళ్తామన్నారు. అధికారుల సమక్షంలోని వారి సమస్య తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. గుండ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల దుస్థితిపై ఓ యువకుడు, చావుబతుకుల్లో ఉన్న తండ్రిని బతి కించుకునేందుకు ఎల్వోసీ ఇప్పించమని ఓ తనయుడు పంపించిన సందేశాలే ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం రూపకల్పనకు ప్రేరణనిచ్చాయని కవ్వంపల్లి పేర్కొన్నారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్‌ కవ్వంపల్లి అనూరాధ, అన్నిశాఖల అధికా రులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement