
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రారంభం
● సమస్యల పరిష్కారమే ధ్యేయం ● నుస్తులాపూర్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
తిమ్మాపూర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆన్వీల్స్ కార్యక్రమాన్ని ప్రా రంభించామని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో గురువారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇక ముందు ఉండబోదన్నారు. వారానికి మూడు రోజులు అధికారుల బృందంతో ఆయా గ్రామా ల ప్రజల వద్దకు వెళ్తామన్నారు. అధికారుల సమక్షంలోని వారి సమస్య తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. గుండ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల దుస్థితిపై ఓ యువకుడు, చావుబతుకుల్లో ఉన్న తండ్రిని బతి కించుకునేందుకు ఎల్వోసీ ఇప్పించమని ఓ తనయుడు పంపించిన సందేశాలే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం రూపకల్పనకు ప్రేరణనిచ్చాయని కవ్వంపల్లి పేర్కొన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనూరాధ, అన్నిశాఖల అధికా రులు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.