
ఏక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను ఈసారి భారీస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మే 22న కరీంనగర్లో నిర్వహించే కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరవుతారని, నిర్వాహకులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఏక్తా యాత్ర పోస్టర్ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరీంనగర్ విభాగ్ సహా సంఘ చాలకులు డాక్టర్ సి.హెచ్ రమణాచారి, విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇ. మధుసూదన్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ మేయర్లు సునీల్రావు, డి.శంకర్, రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, మాజీ కార్పొరేటర్ పవన్, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, ఓదెలు, మురళీకృష్ణ, కరీంనగర్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శలు శ్రీనివాస్గౌడ్, మధుకర్, రఘు, శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు వేణు, బీజేపీ మీడియా కన్వీనర్ లోకేష్, అజయ్వర్మ, ఎలక్షన్స్ సెల్ కన్వీనర్ రమణారెడ్డి, బల్బీర్ సింగ్, రమణారెడ్డి, చైతన్య, రాము పాల్గొన్నారు.