ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

May 1 2025 1:58 AM | Updated on May 1 2025 1:58 AM

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

సారంగాపూర్‌: బీర్‌పూర్‌ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల చిన్న గంగన్న (55) బుధవారం పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గంగన్న ఏడాది క్రితం చెట్టుపై నుండి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. చెట్టుకు ఉరేసుకున్నా డు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

యువకుడి అరెస్ట్‌

కథలాపూర్‌: మండలకేంద్రానికి చెందిన కల్లెడ జైపాల్‌ అక్రమంగా గంజాయి తరలిస్తూ విక్రయిస్తున్న క్రమంలో పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. జైపాల్‌ గంజాయిని కోరుట్ల, కథలాపూర్‌ ఏరియాలో విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మెట్‌పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి తనిఖీ చేపట్టగా సిరికొండ శివారులో పట్టుబడ్డాడు. అతడి నుంచి 96 గ్రాముల గంజాయి, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

స్వగ్రామానికి చేరిన

మృతదేహం

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని పోసానిపేటకు చెందిన గుంట హన్మంతు(42) సౌదీ అరేబియాలో రెండు నెలల క్రితం హత్యకు గురికాగా.. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. హన్మంతు కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్తున్నాడు. తాను ఉంటున్న గదిలో నిజామాబాద్‌ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరి 28న గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హన్మంతు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement