
‘పొన్నం’కు అభినందన
కరీంనగర్: కొత్తపల్లి–హుస్నాబాద్ నాలుగు లైన్ల రోడ్ల విస్తరణకు రూ.77.20 కోట్లు నిధులు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ను శనివారం హైదరాబాద్లో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కలిసి సత్కరించి అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రిని కోరారు. సీపీఐ సిద్దిపేట సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు గుంటి వేణు పాల్గొన్నారు.
చెక్కులు అందజేత
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతిచెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు శనివారం అడిషినల్ డీసీపీ ఎ.లక్ష్మీనారాయణ చెక్కులు అందజేశారు. కె.లింగారెడ్డి సీసీఆర్బీలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందగా రూ.16 లక్షలు, ఏఆర్ విభాగంలో పనిచేసే హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించగా రూ.8 లక్షలు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పనిచేస్తూ గుండెపోటుతో చనిపోయిన కుమారస్వామి కుటుంబ సభ్యులకు రూ.8 లక్షలు భద్రతా విభాగం నుంచి మంజూరయ్యాయి. సదరు మొత్తాన్ని చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందించారు. సీపీవో జూనియర్ అసిస్టెంట్ కళ్యాణి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్థికసాయం
కరీంనగర్కల్చరల్: బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివాసంలో పొన్నం రవిచంద్రతో కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా తనకు పెన్షన్ ఇప్పించాలని కొమురమ్మ కోరగా సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఉపాధిహామీ గ్రామసభలు
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేట, ఫకీర్పేట, ఇరుకుల్ల, మందులపల్లి గ్రామాల్లో శనివారం ఉపాధిహామీ పనులను గుర్తించడంపై గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో చేపట్టబోయే పనులపై చర్చించి తీర్మానం చేశారు. ఈ గ్రామసభల్లో మాజీ సర్పంచ్ కటకం నందయ్య, ప్రత్యేక అధికారులు నళినీకాంత్, వైశాలితో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధికూలీలు పాల్గొన్నారు.
జగపతిరావుకు నివాళి
కరీంనగర్ కార్పొరేషన్: సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత వెలిచాల జగపతిరావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన నివాసంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొడూరి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి మోహన్, నాయకులు ఆకారపు భాస్కర్రెడ్డి, వహాజొద్దిన్, తిరుపతిగౌడ్, వైద్యుల అంజన్కుమార్, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, కోటగిరి భూమాగౌడ్, నాయకులు కాశెట్టి శ్రీనివాస్, గంట శ్రీనివాస్, ఆకుల ప్రకాశ్, ఆకుల నర్సయ్య, పిట్టల శ్రీనివాస్, మెండి చంద్రశేఖర్, అర్ష మల్లేశం, నడిపెల్లి అశోక్రావు, తుమ్మనపల్లి శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.

‘పొన్నం’కు అభినందన

‘పొన్నం’కు అభినందన

‘పొన్నం’కు అభినందన