క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Nov 14 2025 8:12 AM | Updated on Nov 14 2025 8:12 AM

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌

డ్రంకన్‌డ్రైవ్‌ కేసులో పలువురికి జైలుశిక్ష

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా, సాలూర మండలం ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన చింతల సాయిలు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్‌ కోర్టులో హాజరుపర్చగా, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శేష తల్పసాయి 3 రోజుల జైలుశిక్ష, రూ. 2 వేల జరిమాన విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.

వర్ని: మండలంలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా, రుద్రూర్‌ మండలం అంబం గ్రామానికి చెందిన ఇసుక లక్ష్మణ్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్‌ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 2రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మహేష్‌ వెల్లడించారు.

వేల్పూర్‌: వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా భీమ్‌గల్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు, వేల్పూర్‌కు చెందిన ఒకరు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం ఆర్మూర్‌ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున రూ.30వేల జరిమానా విధించినట్లు ఎస్సై సంజీవ్‌ తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం నిజామాబాద్‌ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 8 మందికి జైలుశిక్ష, 13 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌అలీ తెలిపారు. 13 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఐదుగురికి ఏడు రోజుల జైలు శిక్ష, ఒకరికి ఐదు రోజులు, మరొకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు వివరించారు.

వాహనం నడిపిన మైనర్లకు..

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలో ఇటీవల పలువురు మైనర్లు వాహనాలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం నిజామాబాద్‌ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి వారితో ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రధాన రోడ్లపై ప్రచారం చేయించాలని తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

బాలికపై అత్యాచారం:

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేయగా, పోక్సో కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు. సదరు గ్రామానికి చెందిన బాలికను నిందితుడు నాలుగునెలల క్రితం మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతోపాటు పలుమార్లు అత్యాచారం చేశాడన్నారు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించడంతో సదరు బాలిక కుటుంబసభ్యులకు చెప్పలేకపోయింది. ఇటీవల బాలిక తరుచూ వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు ఆమెను మెదక్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాలిక మూడునెలల గర్భం దాల్చినట్లు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పోక్సో కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement