ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

Nov 14 2025 8:12 AM | Updated on Nov 14 2025 8:12 AM

ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

గాంధారి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జెడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌ అధికారులకు సూచించారు. గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా పల్లెలమడుగు తండాలో రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్‌ వేయించారు. గాంధారిలో ఓ లబ్ధిదారుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించారు. అనంతరం మండల కార్యాలయంలో ఐకేపీ, ఉపాధిహామీ సిబ్బంది, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏపీఎం ప్రసన్నకుమార్‌, ఆయాగ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, ఉపాధిహామీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement