కాలభైరవుడికి లక్షదీపార్చన
రెండో రోజు కొనసాగిన సంతతధారాభిషేకం
ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
రామారెడ్డి : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి)లో వెలసిన శ్రీకాలభైరవుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 72 గంటల సంతతధారాభిషేకం సోమవారం రెండోరోజూ కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన ప్రారంభమైంది. ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ, ఈవో ప్రభుగుప్తా తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. భైరవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
కాలభైరవుడికి లక్షదీపార్చన
కాలభైరవుడికి లక్షదీపార్చన


