
పరిష్కార మార్గాలు చూపాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం గానీ పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 142 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందిన భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జుక్కల్లో ఫిర్యాదులు నిల్
పిట్లం(జుక్కల్): ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ రాజు నరేందర్ గౌడ్తో పాటు ఎంపీడీవో రఘు, వైద్య విస్తరణ అధికారి భూమయ్య మాత్రమే పాల్గొన్నారు. మిగిత శాఖల అధికారులు పాల్గొనలేదు. ప్రజావాణిలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తహసీల్దార్ తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 142 వినతులు