
వాటర్ ట్యాంక్ ఎక్కిన భార్యాభర్తలు
● ఆత్మహత్యకు యత్నం.. కాపాడిన పోలీసులు
రామారెడ్డి: కుటుంబంలో నెలకొన్న సమస్యలతో భార్యాభర్తలిద్దరూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రామారెడ్డి గ్రామానికి చెందిన దంపతులు అరుణ, శంకర్ గురువారం రామారెడ్డిలోని పెద్దమ్మ దుబ్బ మిషన్ భగీరథ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు భార్యాభర్తలను సముదాయించి కిందకి దించారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలుంటే పరిష్కరించుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలతోనే వారు ట్యాంకు ఎక్కినట్టు సమాచారం.