
చెత్తతో నిండిన డ్రెయినేజీలు
బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ కుర్మ గల్లీలో సీసీ రోడ్డు అపరిశుభ్రంగా మారింది. హరిజనవాడ సమీపంలోని డ్రెయినేజీ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయింది. ఈ డ్రైనేజీలో కుక్కలు, కోళ్లు పడి చనిపోతున్నాయి.మున్సిపల్ అఽ దికారులు స్పందించి డ్రెయినేజీని,సీసీ రోడ్డును శు భ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
నేత్రదానం
బోధన్: పట్టణంలోని అనిల్ టాకీస్ రోడ్డులోని లక్ష్మి అపార్టుమెంట్ నివాసీ ఎన్ రమేశ్(59) బుధవారం మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులు రమేశ్ నేత్రాలు దానం చేయాలని నిర్ణయించుకొని బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రికి సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి రెండు కళ్లను వైద్యులు సేకరించారని లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు పోలవరపు బసవేశ్వర్ రావు తెలిపారు.