
ఆర్టీసీ సమ్మె వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్: ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 7 నుంచి తలపెట్టిన ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకట్గౌడ్, వీడీ దాస్లు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ముందు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయా లని, ట్రెడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని,గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 వేతన సవరణ బకాయిలను చె ల్లించాలని తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభు త్వం పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు బాలాగౌడ్, శేకర్, ప్రేమ్కుమార్, గిరి, బుచ్చిరెడ్డి, అంజయ్య, శ్యామ్ కార్మికులు పాల్గొన్నారు.