నోటీసు ఉత్తుత్తిదేనా..? | - | Sakshi
Sakshi News home page

నోటీసు ఉత్తుత్తిదేనా..?

May 2 2025 1:15 AM | Updated on May 2 2025 1:15 AM

నోటీసు ఉత్తుత్తిదేనా..?

నోటీసు ఉత్తుత్తిదేనా..?

భిక్కనూరు: మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో ఎలక్ట్రి షియన్‌ డబ్బులు తీసిసినట్లు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అయితే ఎలక్ట్రిషియన్‌కు ఈవో శ్రీధర్‌ నోటీసు జారీ చేసిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత నెల 22వ తేదీన హుండీ లెక్కిస్తున్న సమయంలో ఎలక్ట్రిషియన్‌ లక్ష్మీనారాయణ చేతివాటం ప్రదర్శించగా ఆలయ పునర్నిర్మాణకమిటీ చైర్మన్‌ అందె మహేందర్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ దినపత్రిక అదే నెల 29వ తేదీన వెలుగులోకి తీసుకురాగా భక్తులు ఆలయానికి చేరుకుని ఈవోను నిలదీశారు. అయితే తాను ఎలక్ట్రిషియన్‌కు 23వ తేదీనే నోటీసు ఇచ్చినట్లు ఈవో వారికి తెలిపారు. 29వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అదే రోజు ఉదయం హుటాహుటిన ఆలయానికి చేరుకున్న ఈవో పాత తేదీ(23)తో నోటీసు రూపొందించి ఎలక్ట్రిషియన్‌ నుంచి రిసీవ్డ్‌ సంతకం తీసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నోటీసు ఎవరికి ఇచ్చింది కనీసం అందులో లేదని, ఎలక్ట్రిషియన్‌ సంతకం ఎలా పెట్టారని పలువురు ప్రశ్నించగా, ఆయన సంతకం చేయడంతోనే పేరు అందులో రాయలేదని ఈవో సమాధానమిచ్చారు. ఆ తరువాత ఎలక్ట్రిషియన్‌ పేరును నోటీసు మధ్యలో ఇరికించి మీడియాకు పంపించారు. ఈవో శ్రీధర్‌ లెటర్‌ నంబర్‌, క్రమసంఖ్య లేకుండా నోటీసు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో చిన్న తప్పు చేసిన ఓ ఉద్యోగిని ఎలాంటి విచారణ లేకుండానే సస్పెండ్‌ చేసిన ఈవో.. హుండీ లెక్కింపులో చేతి వాటం ప్రదర్శించిన ఉద్యోగిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

నిబంధనలు పాటించకుండా జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement